భార్య, కూతురిని దారుణంగా చంపిన భర్త

భార్య, కూతురిని దారుణంగా చంపిన భర్త

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో భార్య, కూతురిని  దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. సాయిరూపా గార్డెన్ దగ్గర వెంకటేశ్ అనే వ్యక్తి ఆయన భార్య రమ, కూతురు ఆమనిని  హత్య చేశాడు. రాత్రి ఇంట్లో  ఇనుప పైపుతో కొట్టడంతో వాళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. కొద్ది రోజులుగా రమ ఆమె భర్త వెంకటేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. వెంకటేశే ఇద్దరినీ హత్య చేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 see more news

సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

స్టార్లు మాకొద్దు.. ఫ్రాంచైజీలు వదిలేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే..

పాత బస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు