ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం మూడో డివిజన్ జయనగర్ కాలనీ 17వ స్ట్రీట్ లో నివాసముంటున్న భూక్య పార్వతి(43) ఆదివారం తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మృతురాలి తమ్ముడు భూక్య రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేసే తన బావ భూక్య సీతారాములు, అక్కను హత్యచేసి పారిపోయినట్లు ఆరోపించాడు. శనివారం రాత్రి అక్క, బావ మధ్య ఘర్షణ జరిగినట్లు చుట్టుపక్కల వారు చెప్పారన్నాడు. బావ సీతారాములుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని, అనుమానంతో జయనగర్ లోని ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా అక్క నేలపై పడి మృతి చెంది కనిపించిందని తెలిపాడు. వెంటనే డయల్ 100 కు కాల్ చేసినట్లు చెప్పాడు. 20 ఏండ్లుగా పార్వతిని నిత్యం అనుమానిస్తూ, వేధింపులకు గురిచేసేవాడని ఆరోపించాడు. ఎన్నోసార్లు పంచాయితీలు పెట్టించి సర్ది చెప్పి బావ సీతారాములుతో, అక్కను పంపేవాళ్లమని తెలిపాడు. మృతురాలికి ఇద్దరు సంతానం. ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తోపులాటలో భర్త సీతారాములు, భార్య పార్వతిని బలంగా నెట్టివేయడంతో తలకు సోఫా ఉడ్ బలంగా తగిలి రక్తం కారి చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఖానాపురం హావేలి పీఎస్ సీఐ హరి, ఎస్సై స్వప్న ఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భార్యను చంపి భర్త పరార్
- ఖమ్మం
- July 24, 2023
లేటెస్ట్
- Ranbir Kapoor Ramayana: మూడేళ్ల పాటు రణబీర్ రామాయణం షూటింగ్..బడ్జెట్ ఎంత..రిలీజ్ ఎప్పుడు?
- రాజముద్ర : CAA ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్స్ కేటాయింపు..!
- SRH vs GT: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
- నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు
- రైతులకు అన్యాయం చేస్తే రోడ్డెక్కుతం: కేటీఆర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- పోలీసుల ప్రేక్షక పాత్ర.. నిందితులు 2 నిముషాల్లో దొరుకుతరు: ఆర్ఎస్పీ ట్వీట్
- రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!