భార్య తలతో పోలీసులకు లొంగిపోయిన భర్త

భార్య తలతో పోలీసులకు లొంగిపోయిన భర్త

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త.. స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఎన్ఎస్పి కెనాల్స్ లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస రావు మంగళవారం రాత్రి 12 గంటలకు మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. దాంతో ఆ మహిళ తన భర్త అయిన శ్రీనివాస రావుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది. దాంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస రావు.. తన భార్యను ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద అడ్డగించి వేటకొడవలితో నరికి చంపాడు. తల నంచి మొండెం వేరుచేసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య తలను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. శ్రీనివాస రావుపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

రాత్రికి రాత్రే సొంతూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషంట్

మీరు ఏ టైప్ మాస్క్ వాడుతున్నారు? అలాంటివి వాడితే ప్రమాదమట!

18 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందని కూడా తెలియదు