భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త

భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త

హైదరాబాద్‌: భార్యపై పెట్రోల్ పోసి భర్త వెంకన్న తగలబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. వెంకన్న ఉద్యోగం చేయటం లేదని భార్య నిలదీయడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

వివరాలు: మాహబూబాబాద్ కేంద్రానికి చెందిన సుభద్ర, వెంకన్న దంపతులు.. హైదరాబాద్ లోని గడ్డి అన్నారం సమీపంలోని, మైత్రి నగర్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. వెంకన్న(40) వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడి భార్య సుభద్ర(35)తో గొడవపడ్డ వెంకన్న 6 సంవత్సరాలుగా ఆమెను దూరం పెట్టాడు. నెల రోజుల కిందటే మధ్యవర్తుల ద్వారా మళ్లీ కలిశారు. అయినా వారిద్దరి మధ్యన చీటికి మాటికి గొడవలు వస్తూనే ఉన్నాయి.నిత్యం ఏ పని చేయకుండా తాగిరావడంతో ..వెంకన్న ఉద్యోగం చేయటం లేదని భార్య నిలదీసింది.

ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు వెంకన్న.  స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న సుభద్రను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ..సోమవారం చనిపోయిందని తెలిపారు పోలీసులు. వెంకన్నపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు సరూర్ నగర్ పోలీసులు.