దారుణం : భార్యకు బలవంతంగా పురుగులు మందు తాగించిన భర్త

దారుణం : భార్యకు బలవంతంగా పురుగులు మందు తాగించిన భర్త

బోడుప్పల్  పిర్జాది గూడ లో దారుణం జరిగింది. భార్యను చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా పురుగుల మందు తాగించి కసాయి భర్త పరారయ్యాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

బొల్లారం రసాల బజార్ కు చెందిన లావణ్య(35).పిర్జాది గూడ కు చెందిన వై.జగదీశ్ రావ్(45) భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు పుట్టింటి నుంచి లావణ్య 10లక్షలు తీసుకొని రావాలంటూ హుకుం జారీ చేశాడు. తన పుట్టింట్లో ఆర్ధిక పరిస్థితి బాగలేదని లావణ్య భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. భార్య 10 లక్షలు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న భర్త జగదీష్ చిత్ర హింసలకు గురి చేసేవాడు. డబ్బులు తెచ్చుంటే కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచే వాడనని, నీవల్లే పోటీ చేయలేకపోయానంటూ దూర్భుషలాడేవాడు.

అయితే ఎప్పటిలాగే భార్య పై దాడి చేసిన జగదీష్ బలవంతంగా పురుగుల మందు తాగించి పరారయ్యాడు. బాధితురాలి ఆర్తనాధాలతో అప్రమత్తమైన  స్థానికులు అత్యవసర చికిత్స కోసం    యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితురాలు మృతి చెందింది.

బాధితురాలు లావణ్య మృతి పై ఆమె కుటుంబ సభ్యులు జగదీష్ పెళ్లైన నాటి నుంచి వరకట్న వేధింపులకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనని ఎవరు ఏమీ చేయలేరని, పోలీసులు, నాయకులు అండ ఉందని బెదిరించేవాడని ఆరోపించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో  మేడిపల్లి పోలీసులు నిందితుడు జగదీశ్, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు