న్యాయం కోసం అత్తారింటి ముందు కోడలు నిరసన

న్యాయం కోసం అత్తారింటి ముందు కోడలు నిరసన

సైకో భర్త సంతోష్ కుమార్ వేధింపులు తాళలేక తన ముగ్గురు కూతుళ్లతో అత్తారింటి ముందు కోడలు పెట్రోల్ బాటిల్ తో ధర్నాకు దిగింది.అప్పులు చేసి మద్యం తాగివచ్చి భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ లోని వికాస్ నగర్ లో ఉంటున్న అత్తామామల ఇంటికి చేరుకుని ఆందోళన చేసింది. అయితే కొడలు, మనువరాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. కోడలు రమాదేవిని ఇంటిలోకి రానిస్తే ఆమె వల్ల తమకు ప్రాణహాని  ఉందని చైతన్యపురి పోలీసు స్టేషన్ లో అత్తామామలు నిర్మలాదేవి,ప్రకాష్ రావు ఫిర్యాదు చేశారు. తన వల్ల అత్తామామలకు ఎలాంటి హాని జరగదని..కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెబుతున్నారు.