IPL 2026: చెలరేగిన శాంసన్.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై చెన్నై ఘన విజయం

IPL 2026: చెలరేగిన శాంసన్.. 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై చెన్నై ఘన విజయం

న్యూ ఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విఫలమైంది. మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‎లో ఘోరంగా ఓడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. మొదట బ్యాటింగ్​చేపట్టిన ఢిల్లీ బ్యాటర్లు వరుసగా అవుటయ్యారు. ఈ క్రమంలో సమీర్​రిజ్వి (24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 నాటౌట్), స్టబ్స్​(31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 38) పరుగులు చేయడం వల్ల ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతవారందరూ కనీసం 20 పరుగుల మార్క్​ను కూడా చేరుకోలేదు. 

చెన్నై బౌలర్​నూర్​అహ్మద్​22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన చెన్నై (17.3) ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  సంజు శాంసన్​( 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్​లతో 87), కార్తీక్​శర్మ (31 బంతుల్లో 4 ఫోర్లు,2  సిక్స్​లతో41) చెలరేగి ఆడారు. శాంసన్​కు 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్' దక్కింది. 

టాప్​ ఆర్డర్​ విఫలం

టాస్​గెలిచి బ్యాటింగ్​చేపట్టిన ఢిల్లీ ఆదినుంచే తడబడింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో పరుగులు సాధించడం కష్టతరమైంది. ముకేశ్ చౌదరి వేసిన స్లో బంతిని పాథుమ్ నిస్సాంక (19) సరిగ్గా అంచనా వేయలేక మిడ్-ఆన్‌‌‌‌లో క్యాచ్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ (12) సైతం అఖీల్ హొసేన్ బౌలింగ్‌‌‌‌లో రుతురాజ్ గైక్వాడ్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్నర్ నూర్ అహ్మద్ తన బౌలింగ్‌‌‌‌తో కరుణ్ నాయర్, నితీశ్ రాణాను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. కెప్టెన్ అక్సర్ పటేల్ (7) పేలవమైన షాట్‌‌‌‌తో వికెట్ పారేసుకున్నాడు.11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (38), ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (40 నాటౌట్) ధాటిగా ఆడి స్కోరును గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా తొలి అర్ధభాగంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు. చెన్నై బౌలర్లు నిలకడగా రాణిస్తూ  పరుగులు కట్టడి చేయడంలో సక్సెస్​అయ్యారు. 

చెలరేగిన శాంసన్

లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్​ గైక్వాడ్​ నిలకడగా ఆడారు. తొలి ఓవర్​లో 3 పరుగులు మాత్రమే సాధించారు. అక్షర్​ పటేల్​ వేసిన రెండో ఓవర్ లో శాంసన్​ సిక్స్​ బాదాడు. ఈ ఓవర్​లో 15 పరుగులు రాబట్టారు. లుంగి ఎంగిడి వేసిన నాలుగో ఓవర్​లో రుతురాజ్​(6) అశుతోష్​కు క్యాచ్​ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్​ను కోల్పోయింది. 

అనంతరం క్రీజులోకి వచ్చిన ఉర్విల్​ పటేల్​ ఎంగిడి వేసిన ఆరో ఓవర్​లో రెండు సిక్స్​లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. పవర్​ ప్లే ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. అనంతరం అక్షర్​పటేల్​ బౌలింగ్​లో ఉర్విల్​(17) స్టంప్​ అవుట్​గా వెనుదిరిగాడు. పది ఓవర్లకు చెన్నై 2 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. 

కుల్​దీప్​యాదవ్​ బౌలింగ్​లో వరుసగా రెండు సిక్స్​లు, ఒక ఫోర్​ కొట్టిన శాంసన్​32 బంతుల్లో హాఫ్​సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం వేగం పెంచిన శాంసన్ (52 బంతుల్లో 87), కార్తీక్​శర్మ (31 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. 66 బంతుల్లో 114 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చెన్నై 17.3 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  ఢిల్లీ బౌలర్లలో అక్సర్​పటేల్, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్​తీశారు. 

సంక్షిప్త స్కోరు:

ఢిల్లీ: 20 ఓవర్లలో 155/7 (సమీర్ ​రిజ్వి 40 నాటౌట్, స్టబ్స్​38, నూర్​ అహ్మద్​22/2 )
చెన్నై: 17.3 ఓవరల్లో 159/2 (సంజు శాంసన్​87 నాటౌట్, కార్తీక్ ​శర్మ నాటౌట్41, 
అక్సర్ ​పటేల్ 25/1