అదనపు కట్నం కోసం నిండు గర్భిణీపై భర్త, అత్త దాడి

అదనపు కట్నం కోసం నిండు గర్భిణీపై భర్త, అత్త దాడి

అదనపు కట్నం కోసం ఆశపడి నిండు గర్భిణీని చిత్రహింసలు పెట్టాడు ఓభర్త.. ఇందుకు అతని తల్లి కూడా సపోర్ట్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం పెంబుర్తిలో నివాసం ఉంటున్న గురజాల దామోదర్ అదనపు కట్నం కోసం ఆశపడి తన భార్య రాజేశ్వరిని గతకొంత కాలంగా వేదించసాగాడు. ప్రస్తుతం రాజేశ్వరీ ఆరు నెలల గర్భవతి. దీంతో 25లక్షలు అదనపు కట్నంగా తీసుకురావాలని లేకపోతే అబార్షన్ చేయిస్తానని పలుమార్లు గొడవపడ్డాడు. ఇంతకు ముందుకూడా.. కట్నం కోసం తన భర్త మూడు సార్లు అబార్షన్ చేయించాడని రాజేశ్వరి తెలిపింది. దీంతో పాటే.. దామోదర్ కొంత కాలంగా.. మరో యువతితో అక్రమసంబందం నడుపుతున్నాడని ఆరోపించింది. ఇప్పటికే తన భర్తపై పోలీస్ కంప్లేంట్ ఇచ్చానని… అయినా తన భర్త తీరులో మార్పురాలేదని చెప్పింది రాజేశ్వరి.

బుదవారం హాస్పిటల్ కు తీసుకెళాతానని రాజేశ్వరీని కారు ఎక్కించాడు దామోదర్.. వీరితో పాటు ఆమె అత్తకూడా కరెక్కింది. కొంత దూరం వెళ్లాక గర్భినీ అయిన రాజేశ్వరిని ఆమె అత్త కాలితో తన్నింది. భర్త బ్లేడుతో రాజేశ్వరి చేతిని కోశాడు. దీంతో కారులోనే తీవ్ర ఘర్షన జరిగింది. స్థానికుల సహాయంతో బయటపడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాజేశ్వరిని హాస్పిటల్ లో చేర్చారు.