నన్ను ఓడిస్తే.. నేను పాడెక్కుతా.. నా శవయాత్ర చూస్తారు : పాడి కౌశిక్ రెడ్డి

నన్ను ఓడిస్తే.. నేను పాడెక్కుతా.. నా శవయాత్ర చూస్తారు : పాడి కౌశిక్ రెడ్డి

రాజకీయాల్లో గెలుపు ఎంత ముఖ్యమో.. ఆ విజయం కోసం అభ్యర్థులు ఎంతకు తెగిస్తారో.. ఎంతకు దిగజారుతారో సినిమాల్లో చూస్తూ ఉంటారు.. ఇప్పుడు అలాంటిదే తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి.. ఓటర్లను అభ్యర్థించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ పాడి ఏమన్నాడో చూద్దామా.. 

ప్రచారం చివరి రోజు ఓటర్లతో ఇలా అన్నారు.. మాకు ఓటేయకుండా ఇక మీ ఇష్టం..మా ముగ్గురు శవాలను చూడండీ అంటూ క్లయిమాక్స్ డైలాగ్స్ పేల్చారు. అంతేనా.. ఓటేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తా.. లేకుండా 4వ తేదీ నా శవయాత్రకు రండి అంటూ ఓటర్లకు షాక్ ఇచ్చారు. మీ కడుపులో తలపెడతా.. మీ కాళ్లు పట్టుకుంటా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ దయ, మీ దండం.. ఒక్కసారి కాపాడండి.. ఒక్కసారి కాపాడండి.. గెలిపించండి.. ఓడగొట్టి ఉరితీసుకోమంటారా అంటూ ఊహించని కామెంట్స్ చేశారు..

ప్రచారం చివరి రోజు హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఓట్లు వేయరు అనుకున్నారో ఏమో.. ఏకంగా చస్తానంటూ బెదిరింపులకు దిగటం చూస్తుంటే.. గెలుపు కోసం పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా ఫైట్ చేస్తుంది అర్థం అవుతుంది.