కావాలనే మా ఓట్లు తీసేశారని వృద్ధురాలు ఆవేదన

కావాలనే మా ఓట్లు తీసేశారని వృద్ధురాలు ఆవేదన

కావాలనే మా ఓట్లు తీసేశారని కమలాపూర్ కు చెందిన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ‘గతంలో సర్పంచ్, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎన్నోసార్లు ఓటేశాం. అయితే మేం ఈటల రాజేందర్ కు ఓటేస్తామని మా ఆలుమగల ఓట్లు తీసేశారు. మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు రాకున్నా బాధలేదు కానీ, ఓటు వేయనందుకు బాధపడుతున్నాం. ఓటు వేయకపోవడంతో చచ్చినవాళ్లతో సమానం అయినం. నా ఓటు నాకు కావాలి’ అని ఆమె డిమాండ్ చేస్తోంది.

  • మీడియా కార్డులతో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేటలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓ న్యూస్ చానెల్ ఫేక్ ఐడీ కార్డులతో టీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. న్యూస్ చానల్‎కు చెందిన ఐడీ కార్డులను బీజేపీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు.