కౌన్సిలర్ ఇంట్లో ఎమ్మెల్యే! సోదా చేసిన సీపీ

కౌన్సిలర్ ఇంట్లో ఎమ్మెల్యే! సోదా చేసిన సీపీ

జమ్మికుంటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటిముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమె ఇంటి దగ్గర ముగ్గురు నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ దీప్తి ఇంటి దగ్గర దొంగ ఓట్లు వేసేవారికి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆమె ఇంటి పెంట్ హౌస్‎లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మాటల యుద్ధం పెరగడంతో.. సీపీ సత్యనారాయణ అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని సీపీ స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే లేడని, ఎటువంటి డబ్బులు లేవని ఆయన చెప్పారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను ఇంట్లోకి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించారు.