
వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఓటర్లంతా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.