డబ్బులిస్తేనే ఓటేస్తామంటూ సర్పంచ్ ఇంటిముందు నిరసన

డబ్బులిస్తేనే ఓటేస్తామంటూ సర్పంచ్ ఇంటిముందు నిరసన

ఒకపక్క హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంటే.. మరోపక్క తమకు డబ్బులిస్తేనే ఓటేస్తామని జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామస్తులు సర్పంచ్ ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని.. తమకు కూడా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని కొంతమంది ఓటర్లు నిరసన తెలిపారు. దాంతో పోలీసుల సహకారంతో సర్పంచ్ నిరసనకు దిగిన ఓటర్లను వెనక్కి పంపించారు.