- థాయ్లాండ్లో బంగారు పతకాల పంట
- 3 గోల్డ్ మెడల్స్తో సత్తా చాటిన సిటీ వనిత
- జనవరిలోనూ మూడు గోల్డ్ మెడల్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి అథ్లెటిక్స్లో బంగారు పతకాల పంట పండిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో పాల్గొని మూడు గోల్డ్మెడల్స్సాధించారు. 200 మీటర్ల , 400 మీటర్ల పరుగు పందెంతో పాటు షాట్పుట్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్నారు. సునంద గోల్డ్మెడల్స్సాధించడం ఇదే మొదటిసారి కాదు.. జనవరిలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ మూడు బంగారు పతకాలు గెలుచుకున్నారు.
మహిళల 400 మీటర్లు, 800 మీటర్ల రన్నింగ్, రిలే పోటీల్లో ఈ ఘనత సాధించారు. దీంతో థాయ్లాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారు. సునంద భారతి ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే అథ్లెటిక్స్లో ట్రైనింగ్తీసుకుంటున్నారు. తన భర్త వేమనారాయణ రెడ్డి ప్రోత్సాహం, కుటుంబసభ్యుల మద్దతుతోనే ఈ విజయం సాధించినట్లు సునంద భారతి తెలిపారు.

