హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్వచ్చిన తొలి రోజే చెక్పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేసిన పోలీసులు సరైన ఆధారాలు లేని డబ్బు, బంగారంను పెద్ద మొత్తంలో సీజ్చేశారు. అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాం కాలేజీ వద్ద పోలీసుల తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది.
చందానగర్ పీఎస్పరిధిలో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పరిధిలో షేక్పేట్ పరిధిలో రూ. 30 లక్షల నగదు, శంకర్పల్లి పీఎస్పరిధిలో రూ. 80 లక్షలు, హాబీబ్నగర్లో రెండు చోట్ల తనిఖీల్లో రూ.17 లక్షలు పట్టుబడింది. మంగళ్హాట్ పీఎస్పరిధిలో రూ. 15 లక్షలు, చాదర్ఘాట్ పీఎస్ లిమిట్స్లో రూ. 9.3 లక్షలు, షాద్నగర్లో రాయికల్ టోల్ ఫ్లాజా వద్ద రూ.11.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్లోని ప్రగతినగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాల్లో అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురి పీఎస్పరిధిలో రూ.30 లక్షలు, వనస్థలిపురం పీఎస్లిమిట్స్లో రూ. 6.76 లక్షలు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా రింగ్ రోడ్డు సెంటర్లో చేసిన తనిఖీల్లో పోలీసులు రూ. 5 లక్షల నగదు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఖమ్మం నుంచి మధిరకు వస్తున్న కారులో రూ.12 లక్షల 65 వేలను, తిరువూరు గంపలగూడెం నుంచి మధిర మీదుగా విజయవాడ వెళ్తున్న మరో కారులో రూ.4,60,170 పట్టుకున్నారు.
నిజామాబాద్సిటీలో కార్లను తనిఖీ చేసి నలుగురి నుంచి రూ.52.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బోధన్లోని కొత్తబస్టాండ్వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.5 లక్షలు సీజ్చేశారు. ఆర్మూర్ లో శివారులోని కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్ద ఓ వెహికల్ లో రూ.60 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కుక్కర్లు, చీరలు సీజ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధి శేరిలింగంపల్లిలోని గోపన్పల్లి తండాలో ఓటర్లకు పంచిపెట్టేందుకు రఘునాథ్ యాదవ్ పేరుతో ముద్రించిన 90 కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్లలో ఓ పార్టీకి చెందిన వారు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్ స్క్వాడ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసి, ఓ ఇంట్లో మహిళా సంఘం సభ్యురాలి ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్టు తెలుసుకుని 40 చీరలు రికవరీ చేశారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశారు.