ఈనెల 27  నుంచి పల్స్​  పోలియో

ఈనెల 27  నుంచి పల్స్​  పోలియో


హైదరాబాద్, వెలుగు: ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హైదరాబాద్  అడిషనల్​ కలెక్టరు వెంకటేశ్వర్లు తెలిపారు.  ఈ నెల 27 నుంచి నిర్వహించే పల్స్ పోలియో ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని ఆదేశించారు.   కలెక్టరేట్​ లో బుధవారం  పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సిటీలో ఐదేండ్ల లోపు చిన్నారులు 5 లక్షల 9వేల 461 మంది ఉన్నారన్నారు. మొత్తం 2,800 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4 రోజులు పల్స్ పోలియో  నిర్వహిస్తున్నామని,  ఉదయం 7  నుంచి సాయంత్రం 6 గంటల వరకు  చుక్కలు వేస్తామని చెప్పారు.  ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదిల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఎం వెంకటి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రాజశ్రీ  పాల్గొన్నారు.