ఎల్లుండి వైన్ షాపులు బంద్

ఎల్లుండి వైన్ షాపులు బంద్

హైదరాబాద్ నగరంలో బుధవారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగతా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్,కల్లు దుకాణాలు , రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని సీపీ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.