- నిద్ర మాత్రలు మింగిచనిపోయిన యువతి
పద్మరావునగర్, వెలుగు: అమెరికా వీసా రాలేదనే మనస్తాపంతో ఓ డాక్టర్ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని చిలకలగూడలో జరిగింది. ఏపీలోని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి కజకిస్తాన్లో ఎంబీబీఎస్పూర్తి చేసింది. 2022లో ఫారిన్మెడికల్గ్రాడ్యుయేట్ఎగ్జామ్ క్లియర్ చేసి ఇండియాలో లైసె న్స్కూడా పొందింది. అమెరికా వెళ్లి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్, రెసిడెన్సీ చేయాలనే కలలు కనేది.
ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూయార్క్వెళ్లి బ్రోంక్స్లోని మాంటీఫెరీ మెడికల్సెంటర్కు వెళ్లి అడ్మిషన్ లెటర్, ఈసీఎఫ్ఎమ్జీ సర్టిఫికెట్లు రెడీ చేసుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని జే1 వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ వీసాను విద్యార్థులు, రీసెర్చర్లు, డాక్టర్లకు ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షడు అయిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేయడం రోహిణికి సమస్యగా మారింది.
మొదటి మూడు విడతల టెస్టులు పూర్తి చేసుకున్న ఆమెకు చివరి రౌండ్లో నిరాశే ఎదురైంది. గత నెల హైదరాబాద్లోని యూఎస్కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూ జరగ్గా వీసా రాలేదు. పొటెన్షియల్ఇంటెంట్టు ఇమిగ్రేట్( శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలనే ఉద్దేశం) కారణాన్ని చూపుతూ వీసా రిజెక్ట్చేశారు.
జే1 వీసాకి ఈ కారణాన్ని అరుదుగా వాడుతుంటారు. పైగా స్టెప్వన్యూఎస్ఎంఎల్ఈ స్కోర్స్ 248 రాగా, స్టెప్2 సీఎకే 252 వచ్చింది. ఇవి అమెరికాలో టాప్ రెసిడెన్సీలకు సరిపోతాయి. అయినా జే1 వీసా రాకపోతే జాయిన్అయ్యే అవకాశం లేదు. మరోవైపు వెంటనే వచ్చి జాయిన్కావాలని అక్కడి యూనివర్సిటీ నుంచి సమాచారం రావడంతో ఒత్తిడికి గురైంది. తన అమెరికా కల చెదిరిపోతుందనే నిరాశలో డిప్రెషన్కు గురై ఆత్మహత్య చేసుకుంది.
