
నగరంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుంది. ఏపీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు ఏపీ చెందిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
కూకట్ పల్లిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) పోలీసులు దాడి చేశారు. వివేకానందనగర్ లో ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను SOT పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన .. 840 గ్రాముల కొకైన్ తో పాటు ఇతర మాదక ద్రవ్యాలు, రూ, 50 వేలు , ఐదు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అద్దంకి నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ ముఠా.. కొంతకాలంగా కూకట్పల్లి వివేకానందనగర్ పరిసరప్రాంతాల్లో డ్రగ్స్ను విక్రయిస్తుందని తెలుస్తోంది. కొంత కాలంగా ఈ ప్రాంతంపై నిఘా ఉంచిన పోలీసులు డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ను గుర్తించి వల వేసి పట్టుకున్నారు.
పట్టుబడిన నిందితుల్లో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40).... తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31).... బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38).... అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34)..... షేక్ మస్తాన్వలీ(40).... దేవరాజు యేసుబాబు(29) ఉన్నారు.
ఈ సంఘటనలతో మరోసారి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాప్తి భయానక స్థాయికి చేరిందని స్పష్టమవుతోంది. ఎస్ఓటీ, టీఎస్ నాబ్ బృందాలు డ్రగ్స్ ముఠాలపై కఠినంగా నజర్ పెట్టాయి. యువతను డ్రగ్స్ నుంచి దూరం ఉంచే చర్యలు అవసరమన్నది స్పష్టమవుతోంది.