హైదరాబాద్, వెలుగు: ఈఆర్పీ సొల్యూషన్స్అందించే హైదరాబాద్ ఐటీ కంపెనీ బిట్రాన్జ్ విస్తరణకు రెడీ అయింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, యూఏ ఈవంటి గల్ఫ్దేశాల్లో సేవలు అందిస్తున్నామని, త్వరలో యూరప్, అమెరికా మార్కెట్లలోకి వెళ్తామని సంస్థ ఎండీ షకీర్ పాషా వెల్లడించారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ దగ్గర వంద మంది పనిచేస్తున్నారని, వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 200లకు పెంచుతామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తమకు వందకుపైగా క్లయింట్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈఆర్పీ సొల్యూషన్ల కోసం ఒరాకిల్తో కలసి పనిచేస్తున్నామని అన్నారు. క్లౌడ్, ఆటోమేషన్, ఏఐ సేవలతో పాటు ఖాతాదారుల వ్యాపార సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టామని పాషా తెలిపారు. హైదరాబాద్లో ఆర్ అండ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
