హైదరాబాదీలకు అలర్ట్: నవంబర్ 3 నుంచి మెట్రో టైమింగ్స్ మారుతున్నాయి

హైదరాబాదీలకు అలర్ట్: నవంబర్ 3 నుంచి మెట్రో టైమింగ్స్ మారుతున్నాయి

హైదరాబాద్ మెట్రో టైన్ టైమింగ్స్ మరోసారి మారుతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి కొత్త టైమింగ్స్ అమలులోకి వస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ ప్రారంభం అవుతుందని.. అదే విధంగా రాత్రి 11: గంటలకు చివరి ట్రైన్ ఉంటుందని శనివారం (నవంబర్ 01) ప్రకటన విడుదల చేశారు. 

ఇప్పటి వరకు వర్కింగ్ డేస్ అయిన సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు మొదటి చివరి ట్రైన్ నడిచేది. శనివారం ఉదయం - 6 గంట నుంచి రాత్రి 11:00  గంటలకు చివరి ట్రైన్ ఉండేది.  ఇక ఆదివారం మొదటి ట్రైన్ 7:00 గంటలకు, చివరి ట్రైన్ 11 గంటలకు ప్రారంభం అయ్యేవి. 

►ALSO READ | అమెజాన్ బ్యాడ్ మార్నింగ్ : అర్థరాత్రి టైంలో లేఆఫ్స్ మెయిల్స్ : ఇండియాలో ఎంత మందికి అంటే..!

అయితే సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఇక నుంచి వర్కింగ్ డేస్ తో పాటు వీకెండ్ లో కూడా సేమ్ టైమింగ్స్ ఉండనున్నాయి. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు.. మొదటి ట్రైన్ ఉదయం 6:00 గంటలకు ప్రారంభమైతే.. చివరి ట్రైన్ 11:00 గంటలకు అన్ని టెర్మినల్స్ నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 3వ తేదీ (సోమవారం) నుంచి కొత్త టైమింగ్స్ అమలులోకి రానున్నాయి.