గచ్చిబౌలి, వెలుగు: ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి, పాస్పోర్టులు తీసుకుని, విదేశాలకు తిరిగిన ఉదంతం గచ్చిబౌలి పరిధిలో వెలుగు చూసింది. కోకాపేటకు చెందిన మోతుకుపల్లి లక్ష్మీకాంత్రెడ్డి(55) 1997లో మేధ ప్రసూన్కుమార్రెడ్డి పేరుతో, ఆ తర్వాత ముద్దనోళ్ల లక్ష్మీకాంత్ పేరుతో నకిలీ బర్త్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లతో వేర్వేరు పాస్పోర్టులు పొందాడని పోలీసులు తేల్చారు.
2017లో అసలు పేరుతోనూ పాస్పోర్టు తీసుకుని అమెరికా వెళ్లొచ్చిన నిందితుడు, ఈ ఏడాది మళ్లీ వీసా కోసం గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులేట్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఒకే వ్యక్తి వేర్వేరు పేర్లతో పాస్పోర్టులు కలిగి ఉన్నట్లు యూఎస్కాన్సులేట్అధికారులు గుర్తించి, గత మార్చి 22న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్చేసి, అతని వద్ద నుంచి సెల్ఫోన్, ఐప్యాడ్, పాస్పోర్టు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాస్పోర్టుల జారీ వెనుక సహకరించిన బ్రోకర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
