బండి పానీపూరీది.. అమ్మేది గంజాయి..

బండి పానీపూరీది.. అమ్మేది గంజాయి..

పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. టాస్క్​ ఫోర్స్​ డీసీపీ రాధాకృష్ణ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అబిడ్స్​ వాసి ముస్తాపూర్​ ప్రశాంత్..​ తాజ్​మహాల్​ హోటల్​ క్రాస్​ రోడ్, భారతీ విద్యా భవన్ రోడ్​ ప్రాంతాల్లో పానీపూరి బండ్లను నడుపుతున్నాడు. వీటితో వచ్చే ఆదాయం సరిపోవట్లేదని భావించి ఈ బండ్ల దగ్గరే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ధూల్​పేటకు చెందిన గౌతమ్​ అనే వ్యక్తి నుంచి రూ.25 వేలకు గంజాయి కొనుక్కుని రూ.45 వేలకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్​ప్రకారం రామకృష్ణ థియేటర్​ గేట్​దగ్గర జూన్​ 7 న గంజాయి అమ్మేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.