హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గ్రాడ్యుయేషన్ డే...150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గ్రాడ్యుయేషన్ డే...150 మంది విద్యార్థులకు  పట్టాలు ప్రదానం

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని హైదరాబాద్​పబ్లిక్ ​స్కూల్ గ్రాడ్యుయేషన్ ​డే సోమవారం ఘణంగా జరిగింది. నటుడు పుల్కిత్ ​సామ్రాట్​చీఫ్​గెస్ట్​గా హాజరై, 150 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవితాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. 

పాఠశాల ప్రిన్సిపాల్​స్కంద్​ బాలి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కీలక శాఖల్లో, రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.