
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసి.. వస్తాయని ఎదురుచూస్తున్న చాలా మంది ఆశలు ఫలించడం లేదు. అప్లై చేసి రెండు, మూడు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకూ ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయక ఎవరికీ కార్డులు రావడం లేదు. ఇదే అదనుగా కొందరు బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. రేషన్ కార్డుల దందా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
కొందరు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు..అధికారులతో కుమ్మక్కయి రూ.4వేల నుంచి 5వేల వరకు తీసుకుని కార్డులు ఇప్పిస్తున్నారు. వీరితో పౌరసరఫరాల శాఖకు చెందిన కొందరు ఆర్ఐలు కూడా మిలాఖత్అవుతున్నారు. వీరు బ్రోకర్ల నుంచి వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యత ఇస్తూ తనిఖీ చేసి 15 రోజుల్లో వారికి కార్డులు వచ్చేలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా స్పందించకపోవడంతో కొత్తరేషన్కార్డుల ఇప్పించే దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500లకే గ్యాస్సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండంతో అది పొందడం తప్పనిసరిగా మారింది. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, దరఖాస్తులు రాగానే సర్కిళ్ల వారీగా వాటిని విడదీసి ఆయా సర్కిళ్లలోని ఆర్ఐల ద్వారా ఫీల్డ్విజిట్చేయించాల్సి ఉంటుంది. తనిఖీ చేసి అధికారులు ఓకే చేస్తే వెంటనే కార్డులు మంజూరతున్నాయి. ఇక్కడే పెద్దయెత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో కొందరు మీసేవా కేంద్రాల నిర్వాహకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
అప్లై చేసుకునేటప్పుడే దరఖాస్తుదారులతో మాట్లాడి బేరం కుదుర్చుకుని కార్డులు త్వరగా వచ్చేలా చేస్తామని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో కార్డు వస్తుందన్న ఆశతో చాలామంది డబ్బులు చెల్లిస్తున్నారు. ఇందులోంచే అధికారులకు ముడుపులు ముట్టజెప్తున్నారు. దీంతో డబ్బులిచ్చిన వారి దరఖాస్తులకే అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటినే ముందు క్లియర్చేస్తున్నారు. దీంతో మూడు నెలల కింద అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో వారు ఎప్పుడు కార్డు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.