హైదరాబాద్ నుంచి కాకినాడకు రైల్లో వెళుతుంటారా.. ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..

హైదరాబాద్ నుంచి కాకినాడకు రైల్లో వెళుతుంటారా.. ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..

ఏపీలోని కాకినాడ నుంచి తరచూ హైదరాబాద్ కి ప్రయాణించేవారికి గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. కాకినాడ, హైదరాబాద్ మధ్య రద్దీకి చెక్ చెప్పే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. హైదరాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. 

కాకినాడ - లింగంపల్లి, కాకినాడ - చర్లపల్లి రూట్లలో వారానికి మూడురోజులు స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.కాకినాడ టౌన్ - చర్లపల్లి (07447) రైలు జూలై 5, 2025 నుండి మార్చి 28, 2026 వరకు, చర్లపల్లి - కాకినాడ టౌన్ (07448) రైలు జూలై 6 నుండి మార్చి 29, 2026 వరకు నడపనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ

కాకినాడ టౌన్ - లింగంపల్లి (07445) రైలు జూలై 2, 2025 నుండి మార్చి 30, 2026 వరకు నడుస్తుందని.. లింగంపల్లి - కాకినాడ టౌన్ (07446) రైలు జూలై 3, 2025 నుండి మార్చి 31, 2026 వరకు నడుస్తుందని తెలిపింది రైల్వే శాఖ.ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, 3AC ఎకానమీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్-క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

అసలే ఏపీ తెలంగాణ మధ్య యథేచ్ఛగా సాగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ దందా ఒక పక్క, రైళ్లలో రద్దీ మరొక పక్క వెరసి విసిగిపోయిన సామాన్యుడికి రైల్వే శాఖ తాజా నిర్ణయం కాస్త ఊరట కలిగిస్తుందనే చెప్పాలి.