జులై 15, 16 తేదీల్లో బ్రిక్స్ ట్రేడ్యూనియన్స్ సమ్మిట్ : ఫోరమ్ చైర్మన్ సుంకరి మల్లేశం

జులై 15, 16 తేదీల్లో బ్రిక్స్ ట్రేడ్యూనియన్స్ సమ్మిట్ :  ఫోరమ్ చైర్మన్ సుంకరి మల్లేశం
  •     కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖల మంత్రులను ఆహ్వానించాం

పంజాగుట్ట, వెలుగు: కార్మికుల ఉపాధి, సంక్షేమం కోసం హైదరాబాద్​లోని మారియట్​హోటల్​లో ఈ నెల 15,16న బ్రిక్స్​ట్రేడ్​యూనియన్స్​సమ్మిట్–2026 నిర్వహిస్తున్నట్లు బ్రిక్స్​ట్రేడ్​యూనియన్స్​ఫోరమ్​చైర్మన్​సుంకరి మల్లేశం తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్​కు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​మాండవీయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామన్నారు. 

బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, అరబ్​దేశాలలో కార్మికులకు ఉన్న ఉపాధి అవకాశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. 12 దేశాల నుంచి 170 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కలాల్ శ్రీనివాస్, రమేశ్​గౌడ్, లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.