ఏఐతో డీసిల్టింగ్ పనులు.. వాటర్బోర్డ్ మరో కొత్త టెక్నాలజీ

ఏఐతో డీసిల్టింగ్ పనులు.. వాటర్బోర్డ్ మరో కొత్త టెక్నాలజీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: రోబోటిక్​ టెక్నాలజీతో మానవ రహిత పారిశుధ్య పనులను చేపట్టిన వాటర్​బోర్డు కొత్తగా ఏఐ టెక్నాలజీని వాడి డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మేరకు కొత్త టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఓఅండ్ఎం డివిజన్--2 పరిధిలో ఫీల్డ్​విజిట్​చేశారు.

శాటిలైట్ ఆధారంగా, జీఐఎస్ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థ పని చేస్తుంది. మ్యాన్​​హోళ్లతో పాటు అడ్డంగా ఉన్న పైప్​లైన్లను శుభ్రం చేసే సెల్ఫ్ డిటెక్టివ్ రోబోటిక్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మ్యాన్ హోల్​లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించే ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ అండ్​ ప్రివెంటివ్ వ్యవస్థ ఉంది.