హైడ్రా ఫిర్యాదులపై రంగనాథ్ గ్రౌండ్ విజిట్ ...వచ్చే వారం లో సమస్యల పరిష్కారం

హైడ్రా ఫిర్యాదులపై రంగనాథ్ గ్రౌండ్ విజిట్ ...వచ్చే వారం లో సమస్యల పరిష్కారం
  • పలు చోట్ల హైడ్రా సమావేశాలు

హైదరాబాద్ సిటీ/ఘట్​కేసర్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్ షిప్​తో పాటు ఏకశిలా నగర్​లో పర్యటించారు.  సంస్కృతి టౌన్​షిప్ లో 100 ఫీట్ల రహదారికి అడ్డంగా పెట్టిన గేట్లను ఓపెన్ చేయించారు. కొర్రెములలో 1985లో147 ఎక‌‌‌‌‌‌‌‌రాల్లో ఏక‌‌‌‌‌‌‌‌శిలాన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ లేఅవుట్​వేయగా, 2006లో అందులోని 47 ఎక‌‌‌‌‌‌‌‌రాలను వ్యవ‌‌‌‌‌‌‌‌సాయ భూమిగా లేఅవుట్​ను మార్చేశారని ప్లాట్​ఓనర్స్​ఫిర్యాదు చేయడంతో.. త్వరలో ఇరువురి సమక్ష్యంలో అన్ని రికార్డులను పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. వచ్చేవారం సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నెక్నంపూర్​లో ప్రధాన రహదారి నిర్మాణానికి ఉన్న ఆటంకాలను పరిశీలించారు.

 దాదాపు 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా.. ఆ భూమి తమదే అని స్థానికులు క్లెయిమ్ చేయడమే కాకుండా ఆ స్థలంలోంచి రోడ్డు కూడా వేయనీయకుండా అడ్డుకోవడాన్ని పరిశీలించారు. దీనిపై వచ్చే వారం సమావేశం నిర్వహించి అన్ని పత్రాలను పరిశీలిస్తామని, అభ్యంతరాలు ఉన్నవారిని పిలుస్తామన్నారు. 

తర్వాత గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్ వద్ద వరద కాలువ పనులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు పరిశీలించారు. ఖైతలాపూర్ వద్ద ముల్లకత్వ చెరువు నుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను పరిశీలించారు. అలాగే ఐడీఎల్ చెరువు నుంచి కూకట్ పల్లి నాలాలకు వెళ్లే వరద కాలువ ఆక్రమణలను తనిఖీ చేశారు.