- రూల్స్ పాటించకపోతే సీజ్ చేసుడే
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వ్యాపార సంఘాల వినతితో ఫైర్సేఫ్టీ రూల్స్పాటించేందుకు నెల సమయం ఇచ్చామని, మార్చి రెండో వారం నుంచి మళ్లీ తనిఖీలు ముమ్మరం చేస్తామని హైడ్రా చీఫ్రంగనాథ్తెలిపారు. నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాతబస్తీలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే జుల్ఫీకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సిటీలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణం రూల్స్ఉల్లంఘించడమే కారణమని, అందుకే ఈ అంశంపై తాము దృష్టి పెట్టామన్నారు.
రూల్స్పాటించని వారు ఉంటే సమాచారం ఇవ్వాలని వ్యాపార సంఘాలు, ప్రజలను రంగనాథ్కోరారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎఫ్వో జయప్రకాష్, డీఎఫ్వోలు యజ్ఞ నారాయణ, వెంకన్న, విద్యుత్ అధికారి ఏవీ రామారావు, సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
