బంజారా హిల్స్ లో బసవతారకం ఆసుపత్రి దగ్గర హైడ్రా కూల్చివేతలు..

బంజారా హిల్స్ లో బసవతారకం ఆసుపత్రి దగ్గర హైడ్రా కూల్చివేతలు..

హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. శుక్రవారం ( అక్టోబర్ 10 ) బంజారాహిల్స్ లో ఆక్రమణల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు.

బసవతారకం ఆసుపత్రి సమీపంలో ఉన్న జలమండలికి చెందిన స్థలంలో ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కొండాపూర్‌లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. కొండాపూర్‌లో సర్వేనెంబర్‌ 59లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 12 మంది రైతుల ఆధీనంలో ఎన్నం భూములు ఉన్నాయి. రూ. 3 వేల 600 కోట్ల విలువైన ఆస్తులని ప్రభుత్వం చెబుతోంది.

60 ఏళ్లుగా తమ ఆధీనంలోనే భూములున్నాయని రైతులు చెబుతున్నారు. -భూములను కాపాడుతూ వచ్చామనేది రైతుల వాదన. రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది.