బిల్లులను నేను ఆమోదించాలి:గవర్నర్ తమిళిసై

బిల్లులను నేను ఆమోదించాలి:గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని అన్నారు. తాను తన పరిధికి లోబడి నడుచుకుంటానని చెప్పారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. గవర్నర్ గా తన బాధ్యతను నిర్వర్తిస్తానని తమిళిసై స్పష్టం చేశారు.  

కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామికి గవర్నర్ పూజలు

మేడ్చల్ జిల్లా : దీపావళి సందర్భంగా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి వారిని గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ తాటకం ఉమాపతి శర్మ అందజేశారు.