నేను అప్రూవర్​గా మారలే: అరుణ్ పిళ్లై

నేను అప్రూవర్​గా మారలే: అరుణ్ పిళ్లై

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో తాను అప్రూవర్గా మారలేదని నిందితుడు అరుణ్ పిళ్లై వెల్లడించారు. అప్రూవర్గా మారినట్లు, సెక్షన్ 164 కింద తన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. 

ఆ వార్తలన్నీ ఫేక్ అని, కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాన్ని దాచి తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అరుణ్ పిళ్లై  న్యాయవాది తెలిపారు. సంబంధిత మీడియా సంస్థలపై తన క్లయింట్ తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గురువారం ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.