
- అట్లా ప్రకటించుకోవడం కుదరదు:టీపీసీసీ చీఫ్
- పార్టీలో అభ్యర్థిని ప్రకటించడానికి ఒక ప్రాసెస్ ఉందన్న మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్లీడర్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తాను ఓడిపోయానని, అయినా జూబ్లీహిల్స్నియోజకవర్గ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపించారన్నార. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చాయని, ఈ సారి వందశాతం తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో ఎంతో హార్డ్వర్క్ చేశానని, రాహుల్, సోనియా ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. అయితే, అజారుద్దీన్ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పందించారు. ఒక అభ్యర్థిని ఫైనల్చేయాలంటే కాంగ్రెస్పార్టీలో చాలా ప్రాసెస్ ఉంటుందన్నారు. ముందు పీసీసీకి ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని ఫిల్టర్చేసి అధిష్ఠానానికి 3 నుంచి 5 ఆశావహుల పేర్లను పంపుతామన్నారు.
వీటిని సీఈసీ, సీడబ్ల్యూసీ పరిశీలిస్తుందని, అక్కడ వారు ఒక అభ్యర్థిని ఫైనల్ చేస్తారన్నారు. అప్పటి వరకూ ఎవరు ఎన్ని మాట్లాడినా అదిఫైనల్ కాదన్నారు. అజారుద్దీన్ మళ్లీ పోటీ చేస్తానని చెప్పుకోవడంలో తప్పులేదని, కానీ, అభ్యర్థి ఎంపిక పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం పైనే ఉంటుందని స్పష్టం చేశారు.