జూబ్లీహిల్స్లో నేనే పోటీ చేస్తా : అజారుద్దీన్

జూబ్లీహిల్స్లో నేనే పోటీ చేస్తా : అజారుద్దీన్
  • అట్లా ప్రకటించుకోవడం కుదరదు:టీపీసీసీ చీఫ్
  • పార్టీలో అభ్యర్థిని ప్రకటించడానికి ఒక ప్రాసెస్​ ఉందన్న మహేశ్​కుమార్​ గౌడ్ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్​లీడర్, మాజీ క్రికెటర్ మహ్మద్​ అజారుద్దీన్​స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తాను ఓడిపోయానని, అయినా జూబ్లీహిల్స్​నియోజకవర్గ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపించారన్నార. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చాయని, ఈ సారి వందశాతం తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

నియోజకవర్గంలో ఎంతో హార్డ్​వర్క్​ చేశానని, రాహుల్​, సోనియా ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. అయితే, అజారుద్దీన్​ ప్రకటనపై టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ స్పందించారు. ఒక అభ్యర్థిని ఫైనల్​చేయాలంటే కాంగ్రెస్​పార్టీలో చాలా ప్రాసెస్​ ఉంటుందన్నారు. ముందు పీసీసీకి ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని ఫిల్టర్​చేసి అధిష్ఠానానికి 3 నుంచి 5 ఆశావహుల పేర్లను పంపుతామన్నారు. 

వీటిని సీఈసీ, సీడబ్ల్యూసీ పరిశీలిస్తుందని, అక్కడ వారు ఒక అభ్యర్థిని ఫైనల్​ చేస్తారన్నారు. అప్పటి వరకూ ఎవరు ఎన్ని మాట్లాడినా అదిఫైనల్ కాదన్నారు. అజారుద్దీన్​ మళ్లీ పోటీ చేస్తానని చెప్పుకోవడంలో తప్పులేదని, కానీ, అభ్యర్థి ఎంపిక పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం పైనే ఉంటుందని  స్పష్టం చేశారు.