నవదీప్ లీడ్ రోల్లో దర్శకుడు అవనీంద్ర రూపొందించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ హీరోయిన్. సోమవారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో నవదీప్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో అనవసరమైన సినిమాలు చేశా. నా విలువ ఏమిటో లాక్డౌన్లో తెలుసుకుని ఈ సినిమాకు సైన్ చేశా. నా ఆలోచన విధానానికి, చేయాలనుకుంటున్న సినిమాలకు ‘లవ్ మౌళి’ దగ్గరగా అనిపించింది.
ఇందులో నవదీప్ 2.ఓగా కనిపించబోతున్నా’ అని చెప్పాడు. లైఫ్లో చేయలేను అనుకున్న సాహసాలన్నీ ఈ మూవీ షూటింగ్ టైమ్లో చేశానని చెప్పింది హీరోయిన్. అవనీంద్ర మాట్లాడుతూ ‘నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్గా చెప్పిన లవ్స్టోరీ ఇది’ అని అన్నాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.