నా 25ఏళ్ల ఉద్యోగ జీవితం వదిలేసి ప్రజాసేవకోసం వచ్చా: మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

నా 25ఏళ్ల ఉద్యోగ జీవితం వదిలేసి ప్రజాసేవకోసం వచ్చా: మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి అప్లై చేసుకున్నానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం 11వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తీన్మార్ మల్లన్నతో పాటు మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు.

 25ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని వదిలేసి ప్రజా సేవ చేయాలని వచ్చానని అన్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి నా మొదటి సేవ నా కులానికే చేస్తానని ఈ  సందర్భంగా శ్రీనివాస్ రావు అన్నారు. ఎంపీగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నానన్నారు.