
ఒలింపిక్ రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తానని ప్రకటించిన తర్వాత, మరో రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన అవార్డును తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. నాలుగు డెఫ్లింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన వీరేందర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ)కి కొత్త ప్రెసిడెంట్గా ఎంపిక కావడంతో.. దాన్ని జీర్ణించుకోలేని సాక్షి మాలిక్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా వారికి వీరేంద్ర సింగ్ తన మద్దతును ప్రకటించారు.
సోదరి, ఈ దేశపు కుమార్తె మోదీ కోసం తన పద్మశ్రీని కూడా తిరిగి ఇస్తానని వీరేందర్ సింగ్ చెప్పాడు. సోదరిగా భావించే సాక్షి మాలిక్ ను చూసి గర్వపడుతున్నానని, తమలాగే దేశంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులను కూడా తమ అవార్డులను తిరిగి ఇవ్వమని అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మాలిక్ ఫోటోను షేర్ చేస్తూ వీరేందర్ తన X ఖాతాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అంతకుముందు తాను ప్రధానికి లేఖ రాశానని, తనకు ఇచ్చిన పద్మశ్రీని కూడా ఇచ్చేస్తానని బజరంగ్ పునియా ప్రకటించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ కి చేరుకున్న పునియా.. అక్కడ ఫుట్ పాత్ పై పద్మశ్రీని ఉంచారు. ఆ తర్వాత దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత తొలి బాక్సర్ విజయేందర్ సింగ్ కూడా సాక్షి మాలిక్ కు మద్దతు తెలిపారు.
मैं भी अपनी बहन और देश की बेटी के लिए पदम् श्री लौटा दूँगा, माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को, मुझे गर्व है आपकी बेटी और अपनी बहन @SakshiMalik पर... जी क्यों...?
— Virender Singh (@GoongaPahalwan) December 22, 2023
पर देश के सबसे उच्च खिलाड़ियों से भी अनुरोध करूँगा वो भी अपना निर्णय दे...@sachin_rt @Neeraj_chopra1 pic.twitter.com/MfVeYdqnkL