ప్రధానిపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తా : కేఏ పాల్

ప్రధానిపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తా :   కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు :  ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, ఒకవేళ ఆ వార్తల్లో నిజం ఉంటే.. తెలుగోడి సత్తా చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో మోదీ బరిలో ఉంటే.. ఆయనపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో పాల్‌‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులను తాను తప్పా.. ఎవరూ తీర్చలేరన్నారు. దేశంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ.వెయ్యి కోట్లు ఇచ్చాయని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో తనను విదేశాంగ మంత్రిగా చేయాలని కోరారని, అయితే ఆ పదవిని తాను తిరస్కరించినట్లు తెలిపారు.