గ్లామర్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న నిధి అగర్వాల్ తాజాగా ఓ మైథాలజీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. వారాహ్ ఫిల్మ్స్ బ్యానర్పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు.
సోమవారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంటరెస్టింగ్గా ఉండటంతో పాటు, ఆమెను ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్లో పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పవర్ఫుల్, థ్రిల్లింగ్ కథతో మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
