- రైళ్ల భద్రతా చర్యలపై జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ
హైదరాబాద్సిటీ, వెలుగు : జోన్ పరిధిలో రైళ్ల భద్రత అంశంలో అన్ని స్థాయిల అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించాలన్నారు. సోమవారం రైల్ నిలయంలో జోన్ పరిధిలోని రైళ్ల భద్రత అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
దీనికి దక్షిణ మధ్య రైల్వే అడిషనల్జీఎం సత్య ప్రకాష్, ఇతర శాఖల అధిపతులు హాజరుకాగా, సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ద్వారా పాల్గొన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ నాన్-ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. పాయింట్లు, క్రాసింగ్ల వద్ద భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
