
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్లో రహమత్నగర్నుంచి కాంగ్రెస్కు మెజారిటీ ఓట్లు పడేలా కృషి చేస్తానని రహమత్నగర్కార్పొరేటర్సీఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఈయనను జూబ్లీహిల్స్లోని నివాసంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిశారు. ఉప ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయం కోసం పార్టీ తనకు అప్పజెప్పిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తానన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎన్ రెడ్డి సమక్షంలో పలువురు ముస్లింలు కాంగ్రెస్లో చేరారు.