తన ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీల్లో చేరనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. తనపై ఉంచిన సస్పెన్షన్ను బీజేపీ అధిష్టానం ఎత్తివేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణను హిందు రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యం అని అన్నారు.
మంగళవారం గోషామహల్లో బీసీలకు జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందు రాష్ట్రం కోసం కృషి చేస్తానన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని, అందుకే ఆ సీటును పెండింగ్ లో పెట్టారని విమర్శించారు.
బీజేపీ నాపట్ల సానుకూలంగా ఉంది
తాను బీఆర్ఎస్, కాంగ్రెస్లో చేరేది లేదని, ఇండిపెండెంట్గా పోటీ చేసేది అంతకన్నా లేదని రాజాసింగ్ చెప్పారు. మంగళవారం మీడియాకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మజ్లిస్ హెడ్ క్వార్టర్ ఆఫీసు దారుస్సలాం నిర్ణయిస్తుందన్నారు. అందుకే దాన్ని పెండింగ్ లో పెట్టారని రాజాసింగ్ ఆరోపించారు.