
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. 242 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలడంతో ఇండియాలోనే అతిపెద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో విదేశాల్లో సెటిల్ అవుదామని కొందరు, ఇండియా చూడటానికి వచ్చినవారు కొందరు, చదువుకోడానికి వెళ్తున్న వాళ్లు కొందరు.. వీళ్లందరినీ సురక్షితంగా చేర్చే బాధ్యత తీసుకున్న పైలట్లు, సిబ్బంది సహా.. ఒక్కరు తప్ప దాదాపు అందరి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.
అయితే ఈ విమానాన్ని నడిపిన పైలెట్ తన తండ్రికి ఇచ్చి వగ్దానం ఇప్పుడు అందరి హృదయాలను కరిగిస్తోంది. వయసు మళ్లి అనారోగ్యంతో మంచాన పడిన తండ్రిని చూసుకునేందుకు కొడుకు ఇచ్చిన మాట ఇప్పుడు అందరికీ కలచివేస్తోంది. ‘‘పైలెట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న..’’ అని ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రికి మాట ఇచ్చాడట. కానీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే తండ్రికంటే ముందే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం తీవ్ర విషాదాన్ని నింపింది.
పెళ్లి కూడా చేసుకోలేదు.. వృత్తికే అంకితం:
కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన వాడు. పైలెట్ గా 8 వేల 2 వందల గంటల అనుభవం అతడిది. తన కెరీర్ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. పెళ్లి కూడా చేసుకోకుండా అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకుంటూ .. వృత్తిని నెరవేరుస్తున్నాడని స్థానికులు తెలిపారు. 1994 నుంచి పైలెట్ గా పనిచేస్తున్నాడు.
కొంత కాలం కిందటే.. ఉద్యోగం మానేసి తండ్రిని చూసుకుంటానని మాటిచ్చాడట కెప్టెన్ సుమీత్. ఉన్నట్లుండి తన కొడుకు చనిపోవడంతో ఒంటరినయ్యానని ఆ తండ్రి తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు.
భారత చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం:
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం అంటే 241 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. అయితే మెడికల్ కాజేసీ హాస్టల్ పై పడటంతో మరింత మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్యాపెసంజర్లతో పాటు కలిపి మొత్తం 297 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.