పటాయ (థాయ్లాండ్): ఇండియా పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్, కృష్ణ నగార్ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆదివారం జరిగిన ఎస్ఎల్4 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సుహాస్ 21–18, 21–18తో సెతైవన్ (ఇండోనేసియా)ను, ఎస్ఎల్3 ఫైనల్లో ప్రమోద్ 14–21, 21–15, 21–14తో బెతెల్ (ఇంగ్లండ్)ను ఓడించారు. ఎస్హెచ్6 కేటగిరీ ఫైనల్లో నెగ్గి కృష్ణ నగార్ గోల్డ్ గెలిచాడు.
