ICC ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ బుమ్రా తమ ర్యాంకులను కాపాడుకున్నారు. ఆదివారం లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ICC ర్యాంకింగ్స్ లో వీరు సేమ్ ప్లేస్ లో ఉన్నారు. బ్యాటింగ్ లో కోహ్లీ, బౌలింగ్ లో బూమ్ర ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో 310 రన్స్ చేసిన కోహ్లీ.. 202 రన్స్ చేసిన రోహిత్ శర్మ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ మూడో స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్ విభాగంలో బూమ్రా 774 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రశీద్ ఖాన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఆల్ రౌండర్ల లిస్టులో రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా.. భారత ఆటగాడు కేదార్ జాదవ్ 14వ స్థానానికి చేరుకున్నాడు. మొదటి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్, భారత్ ఉన్నాయి. స్పల్ప తేడాతో న్యూజిలాండ్ మూడో స్థానం, సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండిస్ ఉన్నాయి.
ICC ODI rankings: Kohli, Bumrah retain top spots despite series defeat to Australia pic.twitter.com/rg9acW3gOB
— Prafulla Chowdhury (@PrafullaChowdh5) March 17, 2019