ఐసీఐసీఐ బ్యాంక్, టాటా సహకారంతో.. విశాఖలో క్యాన్సర్ కేర్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన

ఐసీఐసీఐ బ్యాంక్, టాటా సహకారంతో.. విశాఖలో క్యాన్సర్ కేర్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన

హైదరాబాద్​, వెలుగు: ఐసీఐసీఐ బ్యాంక్,  టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)  విశాఖపట్నంలో అధునాతన క్యాన్సర్ కేర్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాయి. ఈ నూతన బ్లాక్  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్స,  సంరక్షణను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.  

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. క్యాన్సర్ చికిత్స రంగంలో టీఎంసీకి ఉన్న అనుభవం వల్ల ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ బ్లాక్​తో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్స అందుతుందన్నారు.