కరీంనగర్‌‌‌‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్

కరీంనగర్‌‌‌‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్

హైదరాబాద్​, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ (ఐపీఆర్‌‌‌‌యూ ఎంఎఫ్​) తెలంగాణలోని కరీంనగర్‌‌‌‌లో తన మొదటి శాఖను ప్రారంభించింది.   ఈ ప్రాంతం తమకు ఒక కీలకమైన వృద్ధి మార్కెట్ అని ఈ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్​ రిటైల్ సేల్స్​ అండ్​ డిస్ట్రిబ్యూషన్ - సౌత్​ జోనల్​ హెడ్​ రేణు నారాయణ్ అన్నారు. 

 ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈ ఏడాది జులై నాటికి మొత్తం రూ. 10.44 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 480కి పైగా శాఖల ద్వారా 12.4 మిలియన్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.  పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా   ఈక్విటీ, డెట్, హైబ్రిడ్,  కమోడిటీ ఫండ్లను అందిస్తున్నామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తెలిపింది.