దుబాయ్​లో కరీంనగర్ వాసి మృతి….మృతదేహం బదులు డెత్ సర్టిఫికెట్ పంపిన్రు

దుబాయ్​లో కరీంనగర్ వాసి మృతి….మృతదేహం బదులు డెత్ సర్టిఫికెట్ పంపిన్రు

కుటుంబ పోషణ కోసం దుబాయ్​వెళ్లిన వ్యక్తి చనిపోగా అంత్యక్రియలు అక్కడే పూర్తి చేసి ఇక్కడకు డెత్​సర్టిఫికెట్​ పంపారు. కుటుంబీకులకు కనీసం కడసారి చూపు కూడా దక్కలేదు. కరీంనగర్​ జిల్లా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఉయ్యాల పరుశరాములు(36)కు పన్నెండేళ్ల క్రితం పెండ్లయింది. భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబపోషణ భారం కావడంతో నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేసేవాడు. కరోనా సోకడంతో మే 13న చనిపోయాడు. చనిపోయిన విషయం కూడా కుటుంబీకులకు చెప్పలేదు. అక్కడే కంపెనీ అధికారులు ఖననం చేసి కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్ పంపారు. డెత్ సర్టిఫికెట్ చూసిన భార్య అనిత ఒక్కసారిగా కుప్పకూలి బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.