అప్పు వాళ్లనడిగితే 10పైసల వడ్డీకే ఇస్తారు: రేవంత్ రెడ్డి

అప్పు వాళ్లనడిగితే 10పైసల వడ్డీకే ఇస్తారు: రేవంత్ రెడ్డి
  • ఎక్కడెక్కడికో ఎందుకు కేటీఆర్, సంతోష్ లను అడగండి
  • సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సూచన

హైదరాబాద్: రాష్ట్రానికి అప్పుల కోసం ఎక్కడెక్కిడికో ఎందుకు కేటీఆర్, సంతోష్ లను అడిగితే 10పైసల వడ్డీకే వేల కోట్లు ఇస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సూచించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంచి కోసం కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరితపిస్తుంటారని, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన.. ఐడియాలజీకి చేయలేదన్నారు. ఆయనతో రాజకీయ పరమైన అంశాల కంటే.. అభివృద్ధి అంశాల మీద, నిరుద్యోగం , కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామన్నారు. 
ఈ రోజు కేసీఆర్.. తెలంగాణ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ను .. అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు. అప్పుల కోసం.. కేసీఆర్ ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, కేటీఆర్, సంతోష్ లను అడిగితే పది పైసల వడ్డీకే వేల కోట్లు ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.