
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబయి ఆర్థిక రాజధానిగా ఉండే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ముంబయిలోని అంధేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబయి, థానే నుంచి పంపిస్తే ఇక్కడ సంపద అనే ఉండదు. అప్పుడు దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి కొనసాగడం కష్టం’’ అని అన్నారు.
#WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here. Mumbai would not be able to remain the financial capital of the country: Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/l3SlOFMc0v
— ANI (@ANI) July 30, 2022
అయితే ఈ వ్యాఖ్యలపై శివసేన సహా పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, మరాఠీలను గవర్నర్ అవమానిస్తున్నారని అన్నారు. సీఎం షిండేకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలన్నారు. మొరార్జీ దేశాయ్ కూడా 105మంది మరాఠీ అమరవీరులను ఇలా అవమానించలేదంటూ ట్వీట్ చేశారు.
थोडक्यात काय तर महाराष्ट्र व मराठी माणूस भिकारडा
— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
आहे...
105 मराठी हुतात्म्यांचा असा अपमान मोरारजी देसाई यांनी देखील केला नव्हता..
मुख्यमंत्री शिंदे ...ऐकताय ना.
की तुमचा महाराष्ट्र वेगळा आहे..
स्वाभिमानाचा अंश उरला असेल तर आधी राज्यपालांचा राजीनामा मागा..
दिल्ली पुढे किती झुकताय? pic.twitter.com/qhjQ3nGEwf